Saturday, June 28, 2025

పాకిస్థాన్‌లో దారుణం.. 16 మంది జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Attack) 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. ఈ దాడిలో పౌరులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఉగ్రవాది సైనికుల కాన్వాయ్ పైకి దూసుకెళ్లాడు. దీంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు పిల్లలు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత తీసుకుంటూ ప్రకటన చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News