Monday, June 30, 2025

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ లోని నార్త్ వజీరిస్తాన్ లో ఆత్మాహుతి బాంబు దాడి లో 13 మంది చనిపోయారు,10 మంది గాయపడ్డారు. ఈ దాడికి భారతదేశమే కారణమన్న పాకిస్తాన్ ఆరోపణను భారత ప్రభుత్వం తీవ్రంగా తిరస్కరించింది.వజీరిస్తాన్ లో జూన్ 28న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడికి భారతదేశాన్ని నిందిస్తూ పాకిస్తాన్ సైన్యం చేసిన అధికారప్రకటనను తీవ్ర ధిక్కారంతో తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన జారీ చేసింది.శనివారం నాడు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది పేలుడు పదార్థాలతో నిండిన వాహనం సైనిక కాన్వాయ్ పైకి దూసుకెళ్లి పేలుపోయింది. దా పేలుడులో 13 మంది సైనికులు మరణించగా, మరో 10 మంది జవాన్లు గాయపడ్డారు. ఇదే సందర్భంగా 19 మంది పౌరులు కూడా గాయపడ్డారని స్థానిక ప్రభుత్వాధికారి వెల్లడించారు.

ఈ దాడి తమపనే అని తాహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ కు చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆహ్మాహుతి విభాగం ప్రకటించింది. పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతాలలో ఇటీవల పెచ్చు పెరిగిన హింసాకాండకు ఈ దాడి అద్దంపట్టింది.2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో తరచు దాడులు పెరిగాయి. ఈ సరిహద్దు దాడులకు కారణమైన టెర్రరిస్ట్ లకు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తోందని
పాక్ పదే పదే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ లో ప్రభుత్వ వ్యతిరేక గ్రూప్ ల దాడుల్లో దాదాపు 290 మంది చనిపోరాయు. వారిలో ఎక్కువ మంది భద్రతా దళాలవారే ఎక్కువ.2025 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. గత సంవత్సరం ఉగ్రవాద సంబంధిత మరణాలు 45శాతం పెరిగి. 1,081 కి చేరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News