న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక జట్టు తరుపు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నరైన్ ఆల్ టైమ్ T20 రికార్డు సాధించాడు. అభిషేక్ ను అవుట్ చేయడంతో నరైన్.. T20లలో తన 209వ వికెట్ను సాధించాడు. దీంతో ఐపిఎల్ లో ఒక జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. నాటింగ్హామ్షైర్ తరపున 208 వికెట్లు తీసిన సమిత్ పటేల్ను నరైన్ అధిగమించాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ను కూడా పెవిలియన్ పంపిన KKR ఆల్ రౌండర్ మరో వికెట్ పడగొట్టిన నరైన్ మొత్తం 210 వికెట్లు సాధించాడు.
కాగా, నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై సన్ రైజర్స్ 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతం బ్యాటింగ్ చేసిన కోల్ కతా 168 పరుగులకే ఆలౌటైంది.