Sunday, July 6, 2025

చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలడుతున్నారు: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: అమలు చేయకుండానే సూపర్ సిక్స్  పథకాలు చేసేశామని చెప్తున్నారని ఎపి మాజీ మంత్రి ఆర్ కె రోజా తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలడుతున్నారని అన్నారు. రోజా చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు ఏమైంది? అని ఉచిత బస్సు ఎక్కడా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేనే లేదని, గతంలో స్కూల్ మెయింటినెన్స్ రూ. వెయ్యి తీసుకుంటే..ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేలు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రీయ విద్యార్థులకు (Central students) తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. కూటమి మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం అని రోజా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News