- Advertisement -
అమరావతి: మహిళలను అవమానపరిచే చర్యలు వైసిపి పార్టీ చేస్తోందని ఎపి మంత్రి పార్థసారధి అన్నారు. వైసిపి ప్రభుత్వంలో పెట్టుబడిదారులు పారిపోయారని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..సూపర్ సిక్స్ పథకాలు ఏడాది పాలన (Year rule) లో అమలు చేశామని, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా వైసిపి అమ్మఒడికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిందని తెలిపారు. అమ్మఒడి పిల్లలందరికి ఇస్తామని ఒక్కరికే ఇచ్చిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు 2027కు పూర్తి చేస్తామని పార్థసారధి పేర్కొన్నారు.
- Advertisement -