Wednesday, June 18, 2025

కమల్ హాసన్ చిత్రం థగ్ లైఫ్ విడుదల వివాదం

- Advertisement -
- Advertisement -

కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనను నిషేధించవలసిందిగా కర్ణాటక థియేటర్ యజమానులపై తుపాకి గురిపెట్టి బెదిరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత కర్ణాటకలో ఆ చిత్రం పై నిషేధం విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు తీవ్రంగా స్పందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్ సి) సర్టిఫైడ్ సినిమా ఏదైనా విడుదల చేయాల్సిందేనని చట్టం నిర్దేశిస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారంలోగా తన ప్రతిస్పందనను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కర్ణాటక హైకోర్టు ముందు పెండింగ్ లో ఉన్నవిషయాన్ని కూడా బదిలీ చేసింది. ఈ వివాదంలో నటుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం కానీ, పని కానీ తమకు లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

సిబిఎఫ్ సి సర్టిపికేట్ ఉన్న ఏ సినిమానైనా విడుదల చేయాలన్నది రూల్ ఆఫ్ లా అని, రాష్ట్ర ప్రభుత్వం ఆ చిత్రం ప్రదర్శన జరిగేటట్లు చూడాలని కోర్టు పేర్కొంది. సినిమా హాళ్లు తగులపడతాయనే భయంతో సినిమాను ప్రదర్శించకూడదనడం
సరికాదని పేర్కొంది. జనం సినిమాను చూడకపోవచ్చు. అదివేరే విషయం. జనాలు సినిమా చూడాలని కోర్టు ఎలాంటి ఆదేశాన్ని జారీ చేయడంలేదు. అయితే సినిమామాత్రం విడదల చేయాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.రేపటిలోగా సమాధానం దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బ్యాన్ విషయంలో రాష్ట్రప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించకూడదని, ఇలా జరగడానికి మేము అనుమతించబోమని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. జూన్ 20లోపు చిత్రం సహనిర్మాత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పరిశీలనకు వస్తుందని, ఆ సమయంలో దీనికి పరిష్కారం లభించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.ఈ ఉదంతం మొత్తం చట్టబద్ధమైన పాలన, ప్రాథమిక హక్కులకు సంబంధించినది. అందుకే కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చిందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

నాథూరామ్ గాడ్సే బోల్తే నాటకం విషయంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢి కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ తీర్పు విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ, నాటకంపై నిషేధాన్ని విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది. ఆ నాటకంలో జాతిపితపై విమర్శనాత్మక వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. .మహారాష్ట్ర ప్రభుత్వంఆ నాటకాన్ని నిషేధించింది. అయితే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం దానిని పక్కన పెట్టింది. గాంధీని జాతిపితగా గౌరవించవచ్చు నని,అయితే భిన్నమైన అభిప్రాయాలను నిరోధించలేమని,
ఇది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన విషయం అని పేర్కొన్నారు.జూన్ 13నే సిబిఎఫ్ సి సర్టిఫైడ్ కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రం కర్ణాటకలో ప్రదర్శనపై వాస్తవ నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్పందన ను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News