Saturday, June 14, 2025

ఆ పిటిషన్లకు నో చెప్పిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

పేపర్ లో తమ పేరు చూసుకోవాలన్నదే ప్రతి ఒక్కరి తాపత్రయం అని వ్యాఖ్య
మే 20న కేసు తదుపరి విచారణ

న్యూఢిల్లీ:  2025 వక్ఫ్ చట్టం రాజ్యాంగ(Waqf Act petitions) బద్ధతను సవాల్ చేస్తూ తాజాగా దాఖలైన రెండు పిటషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతిఒక్కరూ వార్తా పత్రికలలో తన పేరు చూసుకోవాలని కోరుకుంటారని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహ్ లతో కూడిన ధర్మాసనం పెండింగ్ కేసు విచారణ సందర్భంగా మే 20న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఒక పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కేంద్రం తరుపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చట్టాన్ని సవాల్ చేస్తూ భారీగా పిటిషన్లు దాఖలు చేయడం సాధ్యం కాదని అన్నారు.

కాగా, పిటిషనర్ తరపు న హాజరైన హాజరైన న్యాయవాది మాట్లాడుతూ ఏప్రిల్ 8న తాను పిటిషన్ దాఖలు చేశానని, ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎత్తి చూపిన లోపాలను తొలగించానని, కానీ తన పిటిషన్ ను లిస్ట్ లో చేర్చలేదని అన్నారు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి ఒక్కరూ తన పేరు వార్తాపత్రికలలో రావాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. న్యాయవాది తన పిటిషన్ ను పెండింగ్ లో ఉన్న పిటిషన్లతో చేర్చి విచారించాలని కోరగా ఆ విషయాన్ని ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పిటిషన్ ను తోసిపుచ్చారు. పెండింగ్ లో ఉన్న పిటిషన్లలో జోక్యం చేసుకోవడానికి అనుమతించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరగా, మాకు ఇప్పటికే చాలా మంది జోక్యం చేసుకునేవారు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు ఎదుట గల మొత్తం పిటిషన్లలో ఐదు పటిషన్లను మాత్రమే విచారించాలని నిర్ణయించింది.

వక్ఫ్ గా (Waqf Act petitions) ప్రకటించిన ఆస్తులను డి నోటిపై చేసే అధికారం, యూజర్ ద్వారా వక్ఫ్ , లేదా డీడ్ ద్వారా వక్ఫ్ వంటి మూడు అంశాలపై మే 20న మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పిటీషనర్లు లేవనెత్తిన రెండో అంశం రాష్ట్ర వక్ఫ్ బోర్డులు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులకు సంబంధించినది. ఈ బోర్డులలో ఎక్స్ అఫిషియో సభ్యులు తప్ప ముస్లింలను మాత్రమే నియమించాలని వారు కోరుతున్నారు. మూడో అంశం కలెక్టర్ ఆ ఆస్తి ప్రభుత్వ భూమి అవునా కాదా అని నిర్థారించేందుకు విచారణ నిర్వహించినప్పుడు వక్ఫ్ ఆస్తిని వక్ఫ్ గా
పరిగణించరని చెప్పే నిబంధనకు సంబంధించినది. ఏప్రిల్ 17న కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బై యూజర్ తో సహా వక్ఫ్ ఆస్తులను డీ నోటిపై చేయబోమని, మే 5 వరకూ కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ , బోర్డులలో ఎటువంటి నియామకాలు చేయబోమని సుప్రీంకోర్టుకు హామి ఇచ్చింది.అలాగే మధ్యంతర స్టే ఇవ్వవద్దని సుప్రీంకోర్టును కోరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News