న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను సో మవారం హెచ్చరించింది. అయితే రా జ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్టు పేర్కొంది. బీ హార్లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సర్వే కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని, అక్టోబర్ 7న తుది వాదనలు విన్న తరువాత తీర్పును వెలువరిస్తామని, బీహార్ ఎస్ఐఆర్పై తమ తీర్పు పా న్ఇండియా ఎస్ఐఆర్కు వర్తిస్తుందని అ త్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దే శం మొత్తం మీద నిర్వహించే ఇలాంటి కసరత్తును తాము ఆపబోమని కోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 న ప్రచురించిన ఓటర్ల తుది జాబితాకు ఈ కేసు విచారణకు ఎటువంటి తేడా ఉండదని వివరించింది. తేడా ఏమిటంటే అందులో ఏవైనా అక్రమా లు జరిగాయని తాము సంతృప్తి చెందితే ఈ ప్రక్రియను పక్కన పెడతామని పేర్కొం ది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గు ర్తింపు పత్రంగా ఆధార్ను చేర్చాలంటూ సె ప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎలక్షన్ కమిషన్ తరుఫు న విచారణకు హాజరైన సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది ఎస్ఐఆర్ ప్రక్రియ తుది స మీక్ష పూర్తయ్యేవరకు విచారణను వా యిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) అనే ఎన్జివొ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్నారాయణన్ ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోందని,
ఈ ప్రక్రియ లోని చట్టపరమైన అంశాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నామని, రా జ్యాంగ పథకం యొక్క వక్రీకరణ కనిపిస్తే ఇది కొనసాగకూడదని తాము ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఉన్న ఫలంగా అమలు లోకి వచ్చిన ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో కొనసాగకూడదన్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాద న వినిపించారు. దేశం మొత్తం మీద ఎస్సిఆర్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించినందున వీలైనంత త్వరలో ఈ విచారణ చేపట్టాని అభ్యర్థించారు.
Also Read: కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి