భూమిని కొలిచేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి విడతలు వారీగా లంచం తీసుకొని, మిగిలిన డబ్బుల కోసం వేధిస్తున్న మండల సర్వేయర్, చైన్మెన్ ఎసిబి వలలో చిక్కుకున్నారు. ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ సంఘటన వివరాలను విలేకరుల సమావేశంలో బుధవారం వెల్లడించారు. మంచిర్యాల తహసిల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి తన భూమిని కొలిచి ఇవ్వాలని మండల సర్వేయర్ మంజుల, చైన్మెన్ ఉదయ్లను కోరాడు. అయితే ఇందుకు వారు తమకు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఇప్పటికే బాధితుడు రూ.16,500 ఫోన్ పే ద్వారా ఉదయ్కి పంపించాడు. రూ.10 వేల నగదు కూడా అతనికి ఇచ్చాడు.
అయినప్పటికీ తన పని కాకపోవడంతో బాధితుడు మరోసారి వారిని సంప్రదించగా మళ్లీ నోటీసులు సర్వే చేయాలని, భూమి మీదకు రావాలని, అందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించగా అతనికి వాయిస్ రికార్డు ఇచ్చి పంపించారు. అందులో రూ.30 వేలకు సర్వేయర్, చైన్మెన్తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో బాధితుడు ఎసిపి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ పక్కా ప్రణాళికతో బుధవారం మండల సర్వేయర్ మంజులతోపాటు తన తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ఆయన స్థానంలో పనిచేస్తున్న చైన్మెన్ ఉదయ్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నారు.