8 మంది నిందితులు అరెస్టు
కారు, 2-ఎరుకలి కొడవల్లు,1 కత్తి, రూ 1,20,000 రూపాయల నగదు స్వాధీనం
10 మొబైల్ పోన్ లు, జిపిఎస్ ట్రాకర్ స్వాధీనం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు చేధించారు. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్ రావు కలిసి తేజేశ్వర్ ను సుఫారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించాలని తిరుమలరావు కోరాడు. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి తేజేశ్వర్ను చంపేందుకు స్కేచ్ వేశారు. తేజేశ్వర్ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమల రావు స్కెచ్ వేశాడు. తిరుమలరావు, ఐశ్వర్య.. ఎప్పుడూ వీడియోకాల్లో ఉండేవారు. చాలాసార్లు తేజేశ్వర్పై అటాక్ చేసేందుకు సుపారీ గ్యాంగ్ ప్రయత్నించింది. పొలం సర్వే చేయాలని తేజేశ్వర్ను తీసుకొని వెళ్లారు. కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను చంపారు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, ఐశ్వర్య, సుపారీ గ్యాంగ్ను అరెస్ట్ చేశామని వెల్లడించారు.