Sunday, June 22, 2025

ఏడు పదుల వయసులో 51 ఫుష్ అప్స్

- Advertisement -
- Advertisement -

ఏడు పదుల వయసులో 50 కి పైగా ఫుష్ అప్స్ తీసి తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి (ఆర్ ఎన్ రవి) అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన చేసిన ఫుష్ అప్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. మధురై లోని ఓ పాఠశాలలో 10 వేల మంది విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన వేదిక మీద ఆపకుండా 51 ఫుష్ అప్స్ తీశారు. దీంతో ఆయన ఫిట్‌నెస్ చూసి కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వయసు కేవలం నంబరు మాత్రమే అనేందుకు గవర్నర్ ఉదాహరణ అని కొందరు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News