Friday, June 6, 2025

ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయింది: బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగేళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. జూన్ 4 ఎపి రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలుపుతున్నానని, కూటమి విజయానికి నాంది పలికిన టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు బాబు నమస్కారాలు తెలిపారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు.

ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయారని గుర్తు చేశారు. ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు ఇది అని కొనియాడారు. సైకో పాలనకు అంతం పలికారని, ఎపి దశదిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు, ఎపి పునర్నిర్మాణ బాధ్యతగా భావించి రోజూ పని చేస్తున్నామని, ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలన గాడిలో పెట్టామని, సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పట్టాలెక్కించామని, ఎపి దశ దిశను మార్చేందుకు ప్రజలిచ్చిన తీర్పుకు ఇవాళ్టితో ఏడాది పూర్తి అవుతోందని, వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News