Sunday, August 24, 2025

వైసిపి ఎంఎల్ఎ కారును అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు…

- Advertisement -
- Advertisement -

గుంటూరు: పొన్నూరు వైసిపి ఎంఎల్‌ఎ వెంకట రోశయ్యకు నిరసన సెగ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాములో చంద్రబాబునాయుడు రిమాండ్‌ను టిడిపి శ్రేణులు ఖండించాయి. చేబ్రోలు మండలం కొమ్మమూరు కాలువ వద్ద టిడిపి శ్రేణులు నిరసన తెలిపాయి. అటుగా వెళ్తున్న వెంకట రోశయ్య వాహనాన్ని టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. టిడిపి కార్యకర్తల వద్ద సెల్‌ఫోన్లు లాక్కునేందుకు ఎంఎల్‌ఎ భద్రతా సిబ్బంది యత్నించారు. నంద్యాలలో నిరసన చేస్తుండగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ గుండెపోటుకు గురయ్యాడు. డోన్ పాత బస్టాండ్ వద్ద టిడిపి శ్రేణులు నిరసన చేపట్టాయి. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టిడిపి శ్రేణులు నిరసన చేపట్టాయి. కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి గోవింద్‌ను తరలించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News