Saturday, June 14, 2025

విమాన ప్రమాదం.. మృతులకు భారత జట్టు నివాళి

- Advertisement -
- Advertisement -

ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత జట్టు చాలా రోజులక్రితమే భారత క్రికెట్ జట్టు (Team India) ఇంగ్లండ్‌కు చేరింది. అక్కడ రెండు అనధికారిక టెస్టులు ఆడింది. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలి (Flight Crash) 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టీం ఇండియా ఆటగాళ్లు నేడు (శుక్రవారం) బెకెన్‌హామ్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు విమాన ప్రమాద మృతులకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం చేతికి నల్లటి బ్యాండ్ ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు. కాగా, భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News