- Advertisement -
లండన్: కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీం ఇండియా (Team India) అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి.. భారత్ కుప్పకూలిపోయింది. రెండో రోజు 204/6 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఆట ప్రారంభించిన భారత్.. కేవలం 20 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో అర్థ శతకం చేసిన కరుణ్ నాయర్(57) జోష్ టంగ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అట్కిన్సన్ ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్(26) తన వికెట్ కోల్పోయాడు. ఇక అట్కిన్సన్ వేసిన 70వ ఓవర్లో సిరాజ్(0), ప్రశిద్ధ్(0)లు డకౌట్ అయ్యారు. దీంతో 69.4 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలింగ్లో అట్కిన్సన్ 5, టంగ్ 3, వోక్స్ 1 వికెట్ తీశారు.
- Advertisement -