Tuesday, July 1, 2025

చెలరేగిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

నార్తంప్టన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మరోసారి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ (Team India).. రెండో వన్డేలోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే కెప్టెన్ ఆయూష్ మాత్రే ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఎదురుకున్న తొలి బంతికే అతను గోల్డెన్ డక్‌గా ఔట్ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన వైభవ్ సూర్యవంశీ దుమ్ముదులిపేశాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేసి తృటిలో అర్థశతాన్ని చేజార్చుకుని ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత విహాన్ మల్హోత్రా(49), అభిజ్ఞాన్ కుండు(32), రాహుల్ కుమార్(47), కనిష్క్ చౌహాన్(45) పరుగులతో రాణించారు. ఆఖర్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. భారత (Team India) టెయిల్ ఎండర్లను స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. దీంతో భారత్ 49 ఓవర్లలో 290 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో ఫ్రెంచ్ 4, హోమ్, గ్రీన్ తలో మూడు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News