- Advertisement -
లండన్: ఇంగ్లండ్తో జరిగే ప్రతిష్టాత్మక కటెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా (Team India) bఇప్పటికే ఆ దేశానికి చేరుకుంది. ఇక అక్కడ పరిస్థితులను అలవాటు చేసుకొనేందకు లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ (Practice) ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ షేర్ చేసింది. ‘ప్రాక్టీస్ మొదలు’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ను జత చేసింది. కెప్టెన్ గిల్, పైస్ కెప్టెన్ పంత్ మైదానంలోకి రావడం మనం వీడియోలో చూడవచ్చు. తొలుత ఆటగాళ్లు ఇండోర్ స్టేడియంలో స్ట్రేచ్చింగ్ వంటివి చేశారు. ఆ తర్వాత మైదానంలోకి వెళ్లి స్ప్రింట్ రన్నింగ్, ఫీల్డింగ్, ఫుట్బాల్ వంటి సాధన చేస్తారు. కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ని పర్యవేక్షించడం మనం వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ నెల 20 నుంచి లీడ్స్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.
- Advertisement -