- Advertisement -
హైదరాబాద్: ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు వరసగా వెలుగులోకి వస్తున్నాయి. శాన్ఫ్రాన్సిస్కో-కోల్కతా-ముంబయి ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం గుర్తించడంతో కోల్కతాలో విమానం నిలిచిపోయింది. అర్ధరాత్రి 12.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానం కోల్కతాకు వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబయి బయలుదేరుతుండగా ఎడమ ఇంజిన్ లో సాంకేతిక లోపం గుర్తించారు.
భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలోనే ప్రయాణికులను సిబ్బంది దించేశారు. సోమవారం హాంకాంగ్-ఢిల్లీ ఎయిర్ ఇండియా
డ్రీమ్లైనర్ విమానంలోనూ సాంకేతిక సమస్య వచ్చిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -