పాట్నా : తనకు తన చిన్న తమ్ముడు తేజస్వీ యాదవ్కు మధ్య దూరం పెంచేందుకు కొందరు విద్రోహులు కుట్ర పన్నారని లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విమర్శించారు. పార్టీ నుంచి లాలూ తనను పార్టీ నుంచి కుటుంబం నుంచి బహిష్కరించిన తరువాత తొలిసారిగా తేజ్ సామాజిక మాధ్యమంలో స్పందించారు. ఇదంతా కూడా విద్రోహుల చర్య ఫలితం అని బీహార్ మాజీ మంత్రి అయిన తేజ్ తెలిపారు. సామాజిక మాధ్యమంలో తన వ్యాఖ్యకు అనుబంధంగా ఆయన మహాభారతంలో కృష్ణుని రథ సారధ్య ఘట్టం చిత్తరువు పొందుపర్చారు. తన కన్నా తమ్ముడు విజ్ఞడు అని మెచ్చుకున్నారు. ఆయన విజయం అభినందనీయం అన్నారు. కృష్ణుడికి అర్జునుడికి మధ్య అగాథం సృష్టించేందుకు కొన్ని శక్తులు సంకల్పించాయి. అయితే వారి శకుని పాచికలు పారవు తాను అతి త్వరలోనే వారి మాయోపాయాలను ఛేదిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. దుష్ణశక్తులు కృష్ణుని సేనను బంధించగలవేమో కానీ కృష్ణుడిని పట్టుకోలేవని తేల్చిచెప్పారు.
విద్రోహుల కుట్రలు సాగవు: తేజ్ ప్రతాప్
- Advertisement -
- Advertisement -
- Advertisement -