Thursday, September 18, 2025

ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైంది: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల వివరాలను కోమటిరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఎపి భవన్‌లో తెలంగాణ వాటాను మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. ఉమ్మడి ఎపి భవన్‌లోని పలు బ్లాక్‌లను మంత్రి పరిశీలించారు. ఉమ్మడి ఎపి భవన్‌కు చెందిన 19 వివరాలను పరిశీలించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ వివరాలు ముఖ్యమంత్రికి వివరిస్తానని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఉమ్మడి ఎపి భవన్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదని, ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నామని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News