Monday, June 23, 2025

రేపు పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలంయలో మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్ట్, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్‌పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News