మన తెలంగాణ/హైదరాబాద్: వి ద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను తాత్కాలిక పద్దతి లో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. పాఠశాల ల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు బదిలీ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తున్నట్టు ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయులు పనిచేస్తున్న జిల్లాల్లో మాత్రమే నిర్వహించేలా విద్యాశాఖ అనుమతించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి, సమీపంగా ఉన్న అవసరమైన పాఠశాలలకు బదిలీ చేయనున్నా రు. గిరిజన ప్రాంతాల ఉపాధ్యాయులు ఆ ప్రాంతాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల అవసరాలకు మేరకు పరస్పర బదిలీలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. తాత్కాలిక పద్దతిలో కొత్తగా పోస్టింగ్లు పొందిన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా నూతన పాఠశాలలో
రిపోర్టు చేసి, విధులు నిర్వహించాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10 మంది లోపు విద్యార్థులకు ఒక టీచర్, 11 నుండి 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 61 నుంచి 90 విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు, 91 నుంచి 120 మంది విద్యార్థులకు నలుగురు, 121 నుంచి 150 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు, 151 నుంచి 200 మంది విద్యార్థులకు ఆరుగురు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే 200 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ తర్వాత ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతులున్న చోట ఒకటి నుంచి -20 మంది విద్యార్థులకు ఒక లాంగ్వేజ్, మరొకరు నాన్ లాంగ్వేజ్ చొప్పున ఇద్దరు టీచర్లు, ఆపైన ఉంటే నలుగురు ఉపాధ్యాయులను నియమించాలి.