- Advertisement -
వాణిజ్య, వ్యాపార కేంద్రాల్లో ఉద్యోగుల రోజువారీ పని
వేళలు పెంపు వారంలో 48గంటలకు మించరాదు
దాటితే అదనపు వేతనం చెల్లించాలి, అరగంట విశ్రాంతి
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో పని గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పని వేళలు సవరిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. తాజా మార్పుల ప్రకారం రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పని వేళలు 48 గంటలు మించరాదని, ఒక వేళ పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని స్పష్టం చేసింది.
- Advertisement -