Friday, June 13, 2025

అవి ప్రభుత్వ భూములే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి
సంబంధం లేదు న్యాయ స్థానంలో
పోరాటం చేసి గెలిచామని స్పష్టం
చేస్తూ సోమవారం ఉదయం టిజిఐఐసి
ప్రకటన ఖండించిన సెంట్రల్
యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూముల
హద్దుల నిర్ణయం కూడా జరగలేదని
వివరణ సోమవారం సాయంత్రానికి
మరో డాక్యుమెంట్ బయటపెట్టిన
ప్రభుత్వం 2004లోనే ఈ
భూములను ప్రభుత్వానికి అప్పగిస్తూ
నాటి రిజిస్ట్రార్ సంతకం చేసిన పత్రాలు
విడుదల హెచ్‌సియులో టెన్షన్..
టెన్షన్ భారీగా బలగాల మొహరింపు
ఆదివారం ఘటనకు సంబంధించి
ఇద్దరి అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) భూ ముల వేలం వ్యవహారంలో వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో సోమవారం ఒక్క రోజే అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రా ష్ట్ర ప్రభుత్వానిదే అని, ఆ భూమి యాజమాని తానేనని ప్రభుత్వం న్యాయస్థానం ద్వారా ని రూపించుకుందని తెలిపింది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకునిందని పేర్కొం ది. ఆ 400 ఎకరాల్లో హెచ్‌సియుకు అంగు ళం భూమి కూడా లేదని స్పష్టం చేసింది. కొత్త గా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉ న్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని తెలిపింది. 400 ఎకరాలు అటవీ భూమి అంటూ త ప్పు డు ప్రచారం చేస్తున్నారని టిజిఐఐసి వెల్లడించింది. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభు త్వ భూమిగానే ఉందని స్పష్టం చేసింది. కా గా, టిజిఐఐసి ప్రకటనను ఖండిస్తూ సోమవా రం సాయంత్రం హెచ్‌సియు రిజిస్ట్రార్ ప్రకట న విడుదల చేశారు.

ప్రభుత్వం చెబుతున్నట్లు హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని పేర్కొన్నారు. పర్యావరణం, జీవవైవిద్యం కాపాడటానికి సదరు భూములను హెచ్‌సియుకే ఇవ్వాలని కోరతామని తెలిపారు. ఈ క్రమంలో హెచ్‌సియు విద్యార్థుల వరుస ఆందోళనలతో పాటు ప్రతిపక్ష బిఆర్‌ఎస్, బిజెపి నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ భూముల వ్యవహారంలో సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖను బయటపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్‌సియు అప్పగించిందని, సదరు డా క్యుమెంట్‌పై అప్పటి రిజస్ట్రార్ నరసింహులు సైతం సంతకం చేశారని తెలిపింది. 534.28 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వానికి నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు అప్పగించారని, అ యితే అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో 205 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన డాక్యు మెంట్‌లో ఉన్నది.

సోమవారం సాయంత్రం హెచ్‌సియు రిజిస్ట్రార్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని పేర్కొన్నారు. పర్యావరణం, జీవవైవిద్యం కాపాడటానికి సదరు భూములను హెచ్‌సియుకే ఇవ్వాలని కోరతామని తెలిపారు. ఈ క్రమంలో హెచ్‌సియు విద్యార్థుల వరుస ఆందోళనలతో పాటు ప్రతిపక్ష బిఆర్‌ఎస్, బిజెపి పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ భూముల వ్యవహారంలో సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖను బయటపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్‌సియు అప్పగించిందని, సదరు డాక్యుమెంట్‌పై అప్పటి రిజస్ట్రార్ నరసింహులు సైతం సంతకం చేసి ఉందని తెలిపింది. 534.28 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వానికి నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు అప్పగించారని, అయితే అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన లేఖలో ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News