ధాన్యం కొనుగోలు సొమ్ము జమ బిఆర్ఎస్
పాలనతో పోల్చితే రూ.9,139కోట్లు అధికం
ఇప్పటి వరకు 72లక్షల మెట్రిక్ టన్నుల
యాసంగి ధాన్యం కొనుగోలు 2023తో
పోల్చితే 13లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ
8,378 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బి.ఆర్.ఎస్ పాలనతో పోల్చుకుంటే సరిగ్గా జూన్ 8 నాటికి అధికంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించా రు. సోమవారం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబందిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బి.ఆర్.ఎస్ పాలన చివరి రోజుల్లో సరిగ్గా జూన్ 8 నాటికి ఆనాటి ప్రభుత్వం 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చే యగా, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే జూన్ 8 నాటికి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్ వివరించారు.
వానాకాలం సీజన్ లో రికార్డు స్థాయిలో దిగుబడి అ యిన ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారిఅదనంగా 1,344 ధాన్యంకొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను చేపట్టిందని చెప్పారు. 2023 యాసంగి సీజన్లో నాటి ప్రభుత్వం 7,034 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జూన్ 8 నాటికి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అదే యాసంగి సీజన్ లో 8,378 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 12.33 లక్షల మంది రైతాంగానికి ప్రస్తుత ప్రభుత్వం రూ.15,121 కోట్లు చెల్లించిదని తెలిపారు.