మన తెలంగాణ/హైదరాబాద్ : ఎర్రగడ్డలో ని మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహా రం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అ యింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫ రా కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశా రు. ఘటనపై ఆగ్ర హం వ్యక్తం చేసిన ప్రభు త్వం ఆర్ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చే సింది. కలుషిత ఆహారం ఘటనలో ఒక రోగి మృతి చెందగా, 92 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మందిని మెరుగైన వై ద్యం కోసం ఒయు ఆసుపత్రికి తరలించారు. డిశ్ఛార్జి కమిటీ (డీసీ) వార్డులో ఉం టున్న భూపాలపల్లికి చెందిన కరణ్ (30) అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని ర ప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితు ల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాన్నం చేశారు. దీంతోపాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను రోగులకు వడ్డించారు. సాయంత్రం డీసీ వార్డు, కోర్టు వార్డుల్లో మొత్తం 71 మంది రోగులకు వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యాధికారులు వారికి చికిత్స అందించారు. డీసీ వార్డులో ఉన్న కరణ్ జ్వరం, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో నల్లా నీటిని ఆర్వో ప్లాంట్లకు పంపి వాటి ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నారు. స్టీలు బిందెల్లో పట్టిన ఆ నీటిని రోగులు గ్లాసులతో ముంచుకుని తాగుతుంటారని అధికారులు తెలిపారు. ఇలా తాగునీరు కలుషితమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత చెప్పారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో అస్వస్థతకు గురైన బాధితులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పరామర్శించారు. జరిగిన సంఘటన పై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్ ను తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు : హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషిత ఆహార ఘటన తీవ్ర ద్రిగ్బాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి పర్యవేక్షణలో ఉన్నతాధికారులతో విచారణ జరిపించడం జరిగిందని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఫుడ్ కాంట్రాక్టు ను రద్దు చేయడం జరిగిందని, ఘటనకు బాధ్యులైన అధికారి పై చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు వైద్యులతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నారు. అస్వస్థకు గురైన వారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు.
ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరం : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమని, ఒక రోగి మృతి చెందడం దురదృష్టకరమని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించారు. సూపరింటెండెంట్ని కలిసి రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు అందిస్తున్న భోజనాన్ని, వంటశాలను తనిఖీ చేశారు. ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.