- Advertisement -
బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహాధర్నా నిర్వహించనున్నారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కెసిఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కెసిఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలిరానున్నారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తోన్న క్షుద్ర రాజకీయాలపై ధర్నాలో వక్తలు మాట్లాడనున్నారు.
- Advertisement -