కర్నూలు: పెళ్లైన నెల రోజులకే భార్య తన తల్లితో కలిసి నవ వరుడిని ప్రియుడితో హత్య చేయించింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గద్వాల్ జిల్లాకు చెందిన తేజస్విన్ అనే సర్వేయర్, కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యను నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల రావుకు ఐశ్యర్య తల్లి సుజాతతో వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఐశ్యర్యతో తిరుమల రావు కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం. అక్రమ సంబంధానికి ఐశ్యర్య భర్త అడ్డుగా ఉండడంతో అడ్డుతొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 17న భూమిని కొలిచేందుకు ముగ్గురు వ్యక్తులు తేజస్విన్ను తీసుకెళ్లారు. పూడూరు శివారులోకి తీసుకెళ్లిన తరువాత తేజస్విన్ను కత్తులతో పలుమార్లు పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యంలో పడేసి పారిపోయారు.
నవ వరుడు తేజస్విన్ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడి భార్య, అత్త, తిరుమల రావును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో ఐశ్వర్యను తిరుమల రావు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తిరుమల రావు భార్య తిరస్కరించడంతో తాత్కాలికంగా పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలిసిందే. మేఘాలయాలో రాజారఘువంశీ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.