హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె ప్రకటించారు. ఈ నెల 30వ తేదీ లోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని.. లేకపోతే నిరవధిక సమ్మె చేపడతామని జూడాలు వెల్లడించారు. 2024 నవంబర్ నుండి పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదని టిజెయూడిఎ సభ్యులు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కి సమ్మె నోటీసును అందజేశారు. జనవరి నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయడం, సకాలంలో చెల్లింపులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం వంటి తక్షణ పరిష్కారం కోరుతూ టిజెయూడిఎ శుక్రవారం డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. లేకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. అత్యవసర సేవలు తప్ప.. అన్ని సేవలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓసారి జూడాలు సమ్మె చేసేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేసింది.
సమ్మె ప్రకటించిన జూనియర్ డాక్టర్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -