Thursday, June 26, 2025

మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

30రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలి
హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు పదవీకాలం
ముగిసినా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ
పిటిషన్లు విచారించిన న్యాయస్థానం స్థానిక
సంస్థల్లో బిసి రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి
ఉందని ప్రభుత్వం వాదన ఇందుకు నెల రోజుల
సమయం కావాలని అభ్యర్థన ప్రభుత్వం క్లియరెన్స్
ఇస్తే రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఇసి

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నె లలలోగా (సెప్టెంబర్ 30) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు రో జుల కింద రిజర్వు చేసిన తీర్పును బుధవారం వెలువరించింది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించక పోవడం పట్ల హైకోర్టులో దాఖలయిన పిటిషన్లపై ధర్మాసనం పై ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, 30 రోజులలో వార్డుల విభజన ప్ర క్రియ పూర్తి చేయాలని న్యాయమూర్తి, జస్టిస్ టి మాధవీదేవి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌ల పదవీ కాలం జనవరి 31, 2024వ తేదీన ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధనను గుర్తు చేస్తూ నల్లగొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల క్రితం విచారణ చేపటి తీర్పును రిజర్వు చేసింది. గడువు ముగిసినా ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News