Saturday, May 31, 2025

జులై, ఆగస్టులో స్థానిక సమరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలను అడిగారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పలు కారణాలతో డీలా పడిపోయాయని, ఎన్నికలకు వెళితే మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించే అవకాశాలు ఉంటాయని, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే లు ముఖ్యమంత్రితో పేర్కొన్నారు.జూలై చివరి వారం నుంచి లేదా ఆగస్టు మొదటి వారంలోపు సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను పూర్తి చేసుకుందామని నాయకులను, కార్యకర్తలను దీనికోసం సన్నద్ధం చేయాలని సిఎం రేవంత్ ఎమ్మెల్యేలకు సూచించారు.

హబూబ్‌నగర్‌లో బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి వారు సత్కరించారు. దీంతో కాసేపు సిఎం ఎమ్మెల్యేలతో ముచ్చటించారు.ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, తూడి మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. త్రిబుల్ ఐటీ ఏర్పాటు వల్ల పాలమూరు జిల్లా మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యేలు సిఎంతో తెలిపారు.

త్వరలో రైతుభరోసా డబ్బులు జమ
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరు అయిన ట్రిపుల్ ఐటీ ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిద్దామని, జూన్ మొదటి లేదా రెండో వారం లోపు క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేద్దామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నాలుగు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో వేసి మిగతా నాలుగు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు జూన్ రెండు లేదా మూడో వారం లోపు రైతు భరోసా డబ్బులు వేసేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. జూన్ చివరి వారం నుంచి వరుసగా సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి నోటిఫికేషన్‌ను విడుదల చేసి జూలై చివరి వారం నుంచి లేదా ఆగష్టు మొదటి వారంలోపు ఎన్నికలను పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News