Monday, June 16, 2025

సామాజిక సమస్యలపై పోరాడాలి: జయంత్ చౌదరి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ కార్యాలయం ప్రారంభం

సామాజిక సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు
జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టిఆర్‌ఎల్‌డి) రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం హైదరాబాద్‌లో కావాడిగూడ (అన్నం కాంప్లెక్స్) లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయంత్ చౌదరి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో 2012 నుంచి 2014 వరకు టిఆర్‌ఎల్‌డి కీలక పాత్ర పోషించిందని అన్నారు. నాటి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు. రాష్ట్రంలో ఆర్‌ఎల్‌డి పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రైతులు, నిరుద్యోగలు, యువత సమస్యలు, సామాజిక న్యాయం కోసం ఆర్‌ఎల్‌డి పార్టీ పోరాడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టిఆర్‌ఎల్‌డి రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, జాతీయ మహిళా అధ్యక్షురాలు కె. ఇందిరా, వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర సిద్దార్థ్, గిరికుండే, విశాల్ వంజారి, మల్లేష్ గౌడ్, ఋషబ్ జైన్, ఓంకార్ గౌడ్, మడకం ప్రసాద్, నునె భాస్కర్‌రావు, నరసింహారావు, కోరె సాయిరామ్, శ్రీ బైగ్( హైదరాబాద్ అధ్యక్షుడు), బీరన్న (భువనగిరి జిల్లా అధ్యక్షుడు), మొహ్మద్ జానీ (ఖమ్మం జిల్లా అధ్యక్షుడు), సుజాత (ఖమ్మం మహిళా అధ్యక్షురాలు) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News