మన తెలంగాణ/హైదరాబాద్ : సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్ విధానాన్ని భారతీయ స్టాంపు చట్టం1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు- 2025ను తీసుకురావాలని ని ర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ చ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సవరణ బిల్లుపై శనివారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, రె వెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, న్యాయవ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్ర త్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాస్ తదితరులతో సమావేశం నిర్వహించారు.
భారతీయ స్టాంపు చట్టం 1899 ప్రకారం, తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లను, 26 ఆర్టికల్స్ ను సవరించుట కొరకు 2021 సంవత్సరంలో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి భారత ప్రభుత్వం ఆమోదం కొరకు పం పడం జరిగిందని అధికారులు మంత్రి పొంగులేటికి తెలిపారు. అయితే, ఈ బిల్లుపై భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో భారత ప్రభుత్వం ఈ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పం పించడం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చా రు. ఈ నేపథ్యంలోనే 2021లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఉపసంహరించుకొని ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని, నిబంధనలు కట్టుదిట్టమైన రూపంలోకి తీసుకురావడం కొత్త ఒప్పందాలకు చట్టబద్దత కల్పించడం లక్ష్యంగా బిల్లును రూపొందించాలని అలాగే పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావాలని అధికా రులకు మంత్రి పొంగులేటి సూచించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.
మార్కెట్ ధరల సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధ్దం చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతోందని దీనిలో భాగంగా మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ఆలోచన చేస్తున్నామని అలాగే కొత్త, పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉందని, పాత అపార్ట్మెంట్లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని ఈ రెండు అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి విధి, విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.