స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’ అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్టైలిస్ట్-, ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ’మల్లికా గంధ’ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని చార్ట్బస్టర్గా నిలిచింది. తెలుసు కదా టీజర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. టీజర్తో పాటు ఒక అందమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది తెలుసు కదా ప్రేమకథను చూపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ బాల్కనీలో నిలబడి, పక్కన కనిపించే శ్రీనిధి శెట్టి , రాశి ఖన్నా వైపు చూడటం, రాశి చిరునవ్వుతో కనిపిస్తూ, శ్రీనిధి దూరంగా చూడటం, కథలో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ను చూపిస్తోంది. ఈ పోస్టర్ యూత్ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంది. తెలుసు కదా చిత్రం ఈ దీపావళికి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.