Sunday, June 29, 2025

తెలంగాణ భవన్ కు భారీగా పోలీసులు.. ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారా హిల్స్ లోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ భవన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొంతమంది పోలీసులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలోకి పోలీసులకు అనుమతి లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, లీగల్ సెల్, కార్యకర్తలు అడ్డుకోవడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల కార్యాలయంకు సెర్చ్ వారంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News