Monday, August 11, 2025

విద్యార్థుల ఉత్కంఠకు తెర.. పాత పద్దతిలోనే టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదో తరగతిలో (Tenth Class Exams) ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠకు విద్యాశాఖ తెర దించింది. పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం జివొ జారీ చేసింది. అయితే ఇటీవలే ఢిల్లీలోని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (NCERT) నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు.

దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూశారు. దీంతో పాత విధానాన్నే కొనసాగిస్తూ (Tenth Class Exams) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత విధానం ప్రకారమే 20 శాతం ఇంటర్నల్ మార్కులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కులు, 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News