Wednesday, September 10, 2025

బోధన్‌లో ఉగ్రవాది పట్టివేత.. భయాందోళనలో స్థానికులు..

- Advertisement -
- Advertisement -

బోధన్‌: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో (Nizamabad Bhodhan) అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఎ అధికారులు పట్టుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ, పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత బోధన్ కోర్టు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి అనంతరం పటియాలాకు తరలించారు.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఎ, ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నవారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో అషర్ డానిష్‌ అనే వ్యక్తిని జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని బోధన్‌లోనూ ఎన్‌ఐఎ అధికారులు జల్లెడ పట్టి.. పక్కా సమాచారంతో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Also Read : నగరంలో భారీ మొత్తంలో రద్దైన నోట్లు పట్టివేత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News