- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ 1 తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ వెల్లడించిన తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలపై నమోదైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం జనరల్ ర్యాంకింగ్ జాబితా రద్దు చేయాలని, పేపర్లు తిరిగి మూల్యాకనం చేయాలని, కుదరకపోతే తిరిగి పరీక్ష నిర్వహించాలని తీర్పు చెప్పిన విషయం విధితమే. ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన టిజిపిఎస్సి బుధవారం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. కాగా, డివిజన్ బెంచ్లో అనుకూలంగా లేని పక్షంలో సుప్రీం కోర్టుకు సైతం వేళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 తీర్పుపై భిన్నాప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో టిజిపిఎస్సి అప్పీల్కు వెళ్లడం గ్రూప్ 1 పరీక్షల అంశం ఉత్కంఠంగా మారింది.
- Advertisement -