ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ (Nithin) హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న తమ్ముడు సినిమా వరల్డ్వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటి లయ మాట్లాడుతూ “నేను సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకుని 20 ఏళ్లవుతోంది. తమ్ముడు మూవీతో తిరిగి నా నట ప్రయాణం మొదలుపెట్టాను. సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతోంది. తమ్ముడు సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మా అందరిలో ఉంది”అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు.
ఇది అక్కా తమ్ముడి మధ్య జరిగే కథ. అయితే ఇది కొత్త కాన్సెప్ట్ మూవీ. ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. రేపు థియేటర్లోనూ ఇదే స్పందన వస్తుందని నమ్ముతున్నాం. లయ మా సంస్థ ద్వారా మళ్లీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. థియేట్రికల్ గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా తమ్ముడు”అని తెలిపారు. దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ “నితిన్ ఈ కథలోని ఎమోషన్ (Emotion story) అర్థం చేసుకుని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. రేపు తమ్ముడు సినిమా సాధించబోయే సక్సెస్ కు క్రెడిట్ ను దిల్ రాజుకి, నితిన్కు, లయకి, నా ఇతర టీమ్ అందరికీ ఇస్తాను. తమ్ముడు పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ. ఇందులో కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు”అని తెలియజేశారు. హీరో నితిన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో లయ చాలా బాగా నటించారు. అలాగే సప్తమి గౌడ ఈ చిత్రంలో కీ రోల్ చేశారు. జూలై 4న మా మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబి దిత్య, ప్రవీణ్ పూడి, కేవీ గుహన్ పాల్గొన్నారు.