- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్లో వేధింపులు జరుగుతున్నాయని బంజారాహిల్స్ పోలీసులకు మేయర్ పీఆర్ఓ ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేస్తూ మేయర్ను బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు అంతు చూస్తా అంటూ గుర్తుతెలియన ఓ ఆగంతకుండు బెదిరింపులకు పాల్పడినట్టు పీఆర్ఓ వెల్లడించారు.
మిడ్ నైట్లో కాల్స్తో పాటు వాయిస్ మెసేజ్లు కూడా చేసి ఆ వ్యక్తి బెదిరించినట్టు తెలిపారు. బోరబండలో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తిగా ఆ అజాత అగంతకుడు చెప్పుకొచ్చినట్టు పీఆర్ఓ పేర్కొన్నారు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులకు కంప్లెయింట్ చేసిన మేయర్ పిఆర్ఓ.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు..
- Advertisement -