కారు,ప్రైవేట్ బస్సు ఢీ ముగ్గురు దుర్మరణం,
నలుగురికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా
యాచారం మండలం, మాల్ సమీపంలో ఘటన
అతివేగమే ప్రమాదానికి కారణం బస్సు
క్యాబిన్లోకి ఇరుక్కుపోయిన కారు
మన తెలంగాణ/యాచారం: రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ సమీపంలోని సాగర్ ప్రధాన రహదారిపై ఎస్ఆర్ పెట్రోల్ పంపు వద్ద మంగళవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఇదే కారులో ఉన్న మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సిఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకులకు చెందిన వాసా సాయితేజ (24), డ్రైవర్ , వాసా పవన్కుమర్ (26) (కాంక్రీట్ డీల ర్) నగరంలోని బిఎన్రెడి ్డనగర్లో నివాసం ఉంటున్నారు. వాసా రాఘవేందర్ (22) వరంగల్లో చికెన్ సెంటర్లో సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తమ స్నేహితుడి పుట్టనరోజు సందర్భంగా నాగార్జునసాగర్, వైజాగ్ కాలనీలను సందర్శించి పార్టీ చేసుకొన్న అనంతరం తిరిగి నగరానికి వస్తున్నారు. ఇదేక్రమంలో మాల్ సమీపంలో ఎస్సార్ పెట్రోల్ బంక్ మీపంలోకి
రాగానే సాగర్ వైపు వెళుతూ ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి కారును ఢీకొంది. సాయితేజ, పవన్కుమార్, రాఘవేందర్ అక్కడిక్కక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో నలుగురు యువకులు వాసా సాయికుమార్, ఎం.సందీప్, ఈ.శివకుమార్, వాసా శివకుమార్ తీ వ్రంగా గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. చినుకులు పడుతూ రాత్రి వేళ రెండు వాహనాలు వేగంగా ఉం డడంతో కారు దూసుకువచ్చి బస్ క్యాబిన్లో ఇరుక్కుపోయింది. పోలీసులు నాలుగైదు గంటలు శ్రమించి ఇరుక్కు పోయిన కారు నుండి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రు లను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.