బ్రహ్మాజీ, కమిటీ కుర్రోళ్ళు యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్లో ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న ఇంటెన్స్ న్యూఏజ్ క్రైమ్ థ్రిల్లర్ కథకళి.(Kathakali)మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హర్షిత్ రెడ్డి కెమరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా ఫస్ట్ షాట్ కి డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని దర్శకత్వం వహించారు. మధు దామరాజు, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పవన్ మ్యూజిక్ అందిస్తుండగా, జితిన్ మోహన్ డీవోపీగా పని చేస్తున్నారు.
గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్గా ‘కథకళి’ ప్రేక్షకులను సస్పెన్స్, భావోద్వేగాలు, రోలర్ కోస్టర్ రైడ్ అనుభూతిని అందించనుంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ “ఈ కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో కథ హీరో. కాన్సెప్ట్ చాలా బాగుంది”అని అన్నారు. డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ “మంచి ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో వస్తున్నాం. వచ్చే నెల షూటింగ్ ప్రారంభం కానుంది”అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ బ్రహ్మాజీ ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ పెండ్యాల, మధు దామరాజుతో పాటు చిత్ర బృందం పాల్గొంది.