Sunday, June 8, 2025

కుక్కతో పాటు గుంతలో పడ్డ పులి

- Advertisement -
- Advertisement -

కేరళ తమిళనాడు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం మయిలదుంపరై వద్ద రెండు మూగజీవాలు చాలా సేపటివరకూ సంకట స్థితిలో కొట్టుమిట్టాడాయి. ప్రాణసంకట స్థితితో పులి తన స్వభావం మరిచి నిమ్మకు నీరెత్తినట్లు మారింది. ఆదివారం తెల్లవారుజామున ఓ పులి, ఓ కుక్క తొమ్మిది అడుగుల లోతైన గుంతలో పడ్డాయి, పైకి రాలేక చాలా సేపటి వరకూ తల్లడిల్లాయి. అటుగా వెళ్లేవారు ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖాధికారులకు తెలిపారు. దీనితో వారు అక్కడికి వచ్చి ముందుగా పై నుంచే ఈ జంతువులపై మత్తు మందు స్ప్రే చేశారు తరువాత వాటిని అత్యంత జాగ్రత్తగా పైకి తీసుకువచ్చారు. ఘటన గురించి స్థానిక అటవీశాఖ తెలిపింది. గుంతలోపల పడి ఉన్న పులి , కుక్క ఫోటోలను విడుదల చేశారు.

పులి ఈ ప్రాంతంలో కనబడిన కుక్కను చాలా దూరం వేటాడి ంది. ఈ క్రమంలో గుంతలో రెండు పడిపోయాయని వెల్లడైంది. ముందుగా పులిని కదలకుండా చేసి కుక్కను రక్షించి ఆ తరువాత పులిని కూడా బయటకు తీసుకువచ్చారని అధికారులు వివరించారు. ఈ రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. అయితే కుక్కపై పులి దాడి చేసి ఉంటుందని, శరీరంపై గాట్లు ఉన్నాయని తెలిపారు. కుక్కను చంపి తినేందుకు వేటాడిన పులి గుంతలో తన మీద పడ్డ కుక్కను ఏమి చేయకుండా వదిలేసింది. పై నుంచి కిందపడటం, లోపల చీకటి , పైగా దీనికి కూడా ప్రాణభయం పట్టుకోవడంతోనే ఇది తన స్వీయ రక్షణకు యత్నించింది. పక్కనున్న జీవిని తినేందుకు యత్నించలేదని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News