- Advertisement -
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -