Monday, June 16, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. వెంకన్న దర్శనానికి 18 గంటలు

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏప్రిల్ 27వ తేదీ శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.

శుక్రవారం శ్రీవారిని 57,909 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News