- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఇక, మంగళవారం తిరుమల వెంకన్నను 74,477 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,294 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.2.84 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -