వానాకాలం షురూ అవ్వగానే… వారంతపు సెలవులో పట్నం వాసులకు చేరువలో ఉన్న ప్రాంతంగా గుర్తుకు వచ్చేది అనంతగిరి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరిలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఇక్కడ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంతో పాటు, బుగ్గ రామలింగేశ్వరస్వామి, కోట్పల్లి చెరువులో బోటింగ్కి ఎంతో ఉత్సాహంతో పర్యాటకులు పిల్లలు, పెద్దలు అందరు సందడిగా గడిపి వెళ్లారు. అనంతగిరిగుట్ట అడవిలో చివరి ఘాట్లో ఉన్న నంది ఘాట్ దగ్గర ట్రెక్కింగ్ కోసం వచ్చిన పర్యాటకులు సందడిగా గడుపుతూ,
సాయంత్రం కురిసిన తేలికపాటి వర్షంతో పచ్చటి అడవిలో సెల్ఫీలు దిగుతూ గడిపి వెళ్లారు.నంది ఘాట్ దగ్గర ట్రెక్కింగ్ కోసం వచ్చిన పర్యాటకులు వారి వాహనాలు రోడ్డుపైన నిలపడంలో దారుర్, తాండూర్ వెళ్లే ఆర్టిసి, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు వారాంతపు రోజులలో అయినా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు.