Wednesday, June 18, 2025

ఇది హేయమైన చర్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా ఆయన మంగళవారం జూ బ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

అనంతరం మహేష్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది నాయకుల ఫోన్లను చట్టానికి వ్యతిరేకంగా ట్యాప్ చేశారని మండిపడ్డారు. రాజకీ య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఆనాటి సిఎం, కెటిఆర్‌లు సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా ఉండలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కదలికలు అన్నీ ట్రాక్ చేశారని మండిపడ్డారు. 2022 నుంచి కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమని పేర్కొన్నారు. ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తికి అధికారాన్ని కట్టుబెట్టి తమ ఫోన్లను టాప్ చేయించారని ఆరోపించారు. నక్సలైట్ల సానుభూతిపరుల పేరుతో తమ ఫోన్లు టాప్ జరిగాయన్నారు. కెటిఆర్ ఇప్పుడు తాము నీతివంతులం, నిజాయితీపరుమలని అంటున్నారని.. ఆయన సిగ్గుతో తలవంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య అని, తమ ఫోన్లను ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు.

నిజాయితీ గల సిట్ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే ఈ కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవ్వరినీ ఉపేక్షించవద్దన్నారు. విచారణను సజావుగా జరిపి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారికి శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ చరిత్రలో ఇంత మంది ఫోన్లు ట్యాప్ చేయడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితులను శిక్షించాలని కోరారు. ఆనాటి నేతలు వారి అవసరాల కోసం రాజకీయ నాయకులు, జడ్జిలు, విలేకర్లలతో పాటు వారి హయాంలో పని చేసిన అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వారి అవసరాలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకుందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి హార్డ్ డిస్క్‌లను ప్రభాకర్ రావు ధ్వంసం చేయించారన్నారు. ప్రభాకర్ రావు, అప్పటి చీఫ్ సెక్రటరీ కలిసి హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News