- Advertisement -
లాతూర్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాతూర్-సోలాపూర్ హైవేపై ఆశివా పాటి సమీపంలో గురువారం (మే 29) ఉదయం రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు బోల్తా పడగా, మరో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, 18 మంది గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులందరినీ వైద్య చికిత్స కోసం లాతూర్లోని విలాస్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -