- Advertisement -
మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలో దోమలపెంట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తాపడడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులు హైదరాబాదు నుండి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.
- Advertisement -